కాపు న్యాయవాదుల విభాగం

మున్నూరు కాపు న్యూస్

రాజకీయ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ



జాతీయ కమిటీ

TRENDING NOW



www.apstatekapunadu.com





కొండవీటి కోటపై శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటు గురించి జిల్లా ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరిగింది 

 కొండవీడు కోటలో ఫిబ్రవరి 7 8 తారీకులలో కొండవీటి చరిత్ర తెలియజేయడానికి కొండవీడు ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు అయిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నుంచి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి ఫారెస్ట్ అధికారులకు విగ్రహ ఏర్పాటు గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తామని తెలియజేయడం జరిగింది 
www.apstatekapunadu.com



కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది


విజయనగర సామ్రాజ్య చక్రవర్తి *శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి 555 జయంతి వేడుకలలో* భాగంగా వారిని స్మరించుకుంటూ *కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ది. 27-1-2026 మంగళవారం ఉదయం 10-00 గంటలకు* చిలకలూరిపేట, 25వ వార్డు జాగుపాలెం నందు గల యానాది కాలనీలోని పేదలకు *దుప్పట్లు*  మరియు *దోమతెరలు*  పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

 *తదుపరి భాస్కర్ హాల్ సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకులు అందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఘనత గురించి అలాగే ఆ కాలంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించడం జరిగింది*

 *శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైలం దేవస్థానం శ్రీకాళహస్తి దేవాలయం అలాగే ఎన్నో దేవాలయాల నిర్మాణం చేయడం శ్రీకృష్ణదేవరాయలకే సాధ్యమైందని ఈ సందర్భంగా పాల్గొన్న కాపు నాయకులు మాట్లాడటం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘం నాయకులు ఉయ్యూరు నరసింహారావు గోవిందు శంకర్ శ్రీనివాసన్ మల్లెల శివ నాగేశ్వరరావు ఊస రమేష్ ఊస రాఘవ వాట్టెం శ్రీనివాస్ రామిశెట్టి శివప్రసాద్ రంగిశెట్టి పూర్ణచంద్రరావు మంగు నాగరాజు పక్కల రమేష్ ఇంటూరి శివ నాగేశ్వరరావు బందరు కృష్ణ ప్రసాద్ కమ్మిలి శివరామకృష్ణ మిరియాల లక్ష్మీనారాయణ మారెళ్ళ శ్రీనివాసరావు శంకరపు పిచ్చయ్య భవనం శ్రీనివాసరావు పువ్వాడ నాగు తంగేళ్ల శివప్రసాద్ తంగేళ్ల రామ్మోహన్ రావు కోట చంద్ర తదితర కాపు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*
www.apstatekapunadu.com




 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కమిటీలు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున కాపు నాయకులు అభిమాను లు అందరూ తమ తమ బయోడేటాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడుకి పంపవలసిందిగా కోరుచున్నాము 

www.apstatekapunadu.com





 
 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు లీగల్ సెల్  అధ్యక్షులుగా నియమితులైన ప్రముఖ న్యాయవాది బైరా హనుమంతరావు


ఈరోజు చిలకలూరిపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో విజయదశమి పండుగ సందర్భంగా ప్రముఖ న్యాయవాది బైరా హనుమంతరావు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల విభాగ అధ్యక్షులుగా నియామకం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు ఈ నియామకం పొందిన న్యాయవాది బైర హనుమంతరావు గారిని రాష్ట్ర కాపురాడు కార్యాలయంలో అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియామకం పొందిన బైరా హనుమంతు రావు గారు మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు
www.apstatekapunadu.com




 
 
 
 
*చిలకలూరిపేట కాపు కళ్యాణ్ మండపం పునర్ నిర్మాణ కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు*
 ఈరోజు ఉదయం 10 గంటల కు స్థానిక కృష్ణారెడ్డి డొంక లో ఉన్న  చిలకలూరిపేట కాపు కళ్యాణ్ మండపం పునర్ నిర్మాణ కార్యక్రమం లో భాగంగా కళ్యాణ మండపం ముఖ ద్వారాన్ని ఏర్పాటు కోసం పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది . తదుపరి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ముఖ్య కాపు నాయకులు నిర్మాణ కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలి అనే అంశంపై మీటింగు ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్య నాయకులను తాత్కాలిక కమిటీ గా ఏర్పాటు చేసుకొని ఆర్థిక వనరుల కోసం పట్టణంలోని కాపు కుటుంబ సభ్యులను అలాగే నియోజకవర్గంలో ఉన్న కాపు కుటుంబ సభ్యులను కలిసి నిర్మాణ పనుల గురించి వివరించి ఆర్థిక సహాయం కోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరదామని పాల్గొన్న కాపు కుటుంబ సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాణ కమిటీ లో ఉన్న ముఖ్య సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు జనసేన సమన్వయకర్త తోటరాజ రమేష్ తోట రామచంద్ర బాబు కాయల తేజ మూర్తి పొన్నం చంద్రశేఖర్ ఉయ్యూరు నరసింహారావు  పోతురాజు హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
www.apstatekapunadu.com



 

 

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ప్రాంతీయ కార్యాలయంలో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మల్లెల శివ నాగేశ్వరావును ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం అందరూ మల్లెల శివ నాగేశ్వరావును పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది.

www.apstatekapunadu.com




*పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మల్లెల శివ నాగేశ్వరరావు ను ఘనంగా సన్మానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంఘం* 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో బిజెపి పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావు ఘనంగా సన్మానించిన కాపు సంఘం  నాయకులు సన్మానించిన కాపు నాయకులందరూ మరెన్నో పదవులు అధిరోహించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులు  గోవింద శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు కార్యదర్శి జగ్గాపురం రామారావు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేశ్వర్లు జనసేన నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆముదాల లీలా కిషోర్ సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
www.apstatekapunadu.com



*కాపుల చిరకాల వాంఛ అయిన బీసీ రిజర్వేషన్ కోసం చిత్తూరు నుండి అమరావతి వరకు పాదయాత్ర*
 
ప్రముఖ విలేఖరి కాపు నాయకులు యువకుడు సానా ప్రసాద్ కూటమి  ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ గురించి గుర్తు చేయడానికి అలాగే రిజర్వేషన్ అమలు చేయటానికి విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి సానా ప్రసాద్ ఎన్నో వ్యాయ ప్రయాసలకు ఓర్చుకొని తన ఆర్థిక స్తోమతను లెక్కచేయకుండా చిత్తూరు నుండి కడప కర్నూలు ఒంగోలు మీదగా చిలకలూరిపేటకు విచ్చేయడం జరిగింది. చిలకలూరిపేటకు విచ్చేసిన సానా ప్రసాద్కు ఘనస్వాగతం తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు తాను చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేసి చిలకలూరిపేటలో ఉన్న కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా విగ్రహాలకు పూలమాలలు వేసి తాను చేస్తున్న పోరాటం గురించి చిలకలూరిపేట కాపు నాయకులకు యువకులకు మహిళలకు తన పాదయాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు సానా ప్రసాదు తన మిత్ర బృందం స్థానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చు కోల మురళీకృష్ణ  వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేశ్వర్లు స్థానిక కాపు నాయకులు కటారి సుధాకర్ ఇర్రి రాఘవ ఊసా రమేష్ ఊస  శేషు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
www.apstatekapunadu.com



కాపుల్ని బీసీల చేర్చాలని డిమాండ్ నెరవేర్చడం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు  కాపు ముద్దుబిడ్డ సానా ప్రసాద్ చిత్తూరు నుండి అమరావతి వరకు జరుగుతున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు 

సానా ప్రసాద్ కాపు బిడ్డ, ఒంగోలు వాస్తవ్యుడు ఆంధ్రప్రదేశ్  కాపు, బలిజ, తెలగ, ఒంటరి BC రిజర్వేషన్స్ సాధన సమితి వ్యవస్థపక అధ్యక్షుడు 08.06.'25 న  చిత్తూరు  నుండి అమరావతి వరకు  కాపు పెద్దల సౌజన్యముతో, ఎలాంటి రాజకీయ పార్టీలకు గ్రూపులకు  అతీతముగా  ప్రారంభించిన శాంతియుత పాదయాత్ర   తిరుపతికి  కాళహస్తి రాజంపేట మీదుగా కడప కర్నూల్ తరువాత ప్రకాశం జిల్లా లో హైవే లోకి వస్తారు తిరుపతిలో రాయలసీమ కాపు పెద్దలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని తదుపరి రాజంపేట కు చేరుచున్న పాదయాత్ర. చిత్తూరు నుండి రేణిగుంట వరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల పెద్దలు, యువత పిల్లలు అందరూ  సానా ప్రసాద్ తలపెట్టిన శాంతియుత పాదయాత్రకు చేయూత నిచ్చి వెన్నంటి ప్రోత్సహం చూపించినరు. జరుగుచున్న పాదయాత్ర కు మద్దతుగా నిలిచినా కాపు బలిజ ఒంటరి తెలగ పెద్దలకు మహిళలకు యువకులుకు అందరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు.
www.apstatekapunadu.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంగవీటి మోహన రంగా విగ్రహాల ధ్వంసం కార్యక్రమం లో పాల్గొన్న దుష్ట మూకలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు 
 పిఠాపురం నియోజకవర్గంలో  యు కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి సంబంధించిన చేతులు తీసివేయటం జరిగింది. చేతులు తీసివేసిన దుష్ట మూకలను వారు ఎంతటి పలుకుబడి ఉన్న వారైనా సరే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి అప్రజ స్వామిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు. ఈ మధ్యకాలంలో సఖినేపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహ స్థాపనకు పర్మిషన్ లేదంటూ హడావుడి చేసి విగ్రహాన్ని పెట్టకుండా ఇబ్బందులు పాలు చేసిన చర్యలను కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం.
www.apstatekapunadu.com




ఏ పి స్టేట్ కాపునాడు సేవ సమితి ఉమ్మడి చిత్తూరు మహిళా అధ్యక్షురాలు గా దామా రాధా గారికి పసుపులేటి హరి ప్రసాద్ గారి చేతుల మీదుగా తిరుపతి జిల్లా అధ్యక్షులు మధు రాయల్ అద్వర్యం లో నియామక పత్రము ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ పసుపులేటి హరి ప్రసాద్ గారు మాట్లాడుతూ 200 మంది మహిళలలో కాపునాడు  సమావేశం ఏర్పాటు చేయమ్మని అన్నారు. ఈ కార్యకమములో ,జిల్లా అధికార ప్రతినిధి తుపాకుల మురళి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జ్ఞాన చంద్ర, పగడాల సునీల్ రాయల్ పాల్గొనడం జరిగింది.
www.apstatekapunadu.com



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు సేవా సమితి తరపున చిలకలూరిపేట పట్టణ అధికార ప్రతినిధిగా చిలకలూరిపేట నియోజకవర్గం కాపు నాయకులు పెద్ది శెట్టి వెంకటరమణ నియామకం చేయడం జరిగింది.
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో పెద్ది శెట్టి వెంకటరమణ లో చిలకలూరిపేట పట్టణ అధికారి ప్రతినిధిగా నియమితులైన వెంకటరమణ కు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు నియామక పత్రం అందించడం జరిగింది. తదుపరి నియమితులైన రమణను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నియామక పత్రం అందుకున్న వెంకటరమణ సంస్థ అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని సమస్త అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ నియామకం  సహకరించిన జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు చిలకలూరిపేట నియోజకవర్గ మీడియా ఇంచార్జి కటారి సుధాకర్ నాయుడు ఇర్రి రాఘవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
www.apstatekapunadu.com


కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రామచంద్రపురం నియోజకవర్గ ప్రముఖ  కాపు నాయకురలైన   రామచంద్రపురం నియోజకవర్గ కన్వినర్ గెడ్డం శ్రీనివాసరావు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న గెడ్డం శ్రీనివాసరావు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన రామచంరాపురం నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  కోనసీమ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
www.apstatekapunadu.com






సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో  స్థానిక జానకి రామయ్య కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు అయిన పసుపులేటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కాపునాడు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా జాతియ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కాపునాడు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి స్థానిక కాపు నాయకుల కు వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లెల శివ నాగేశ్వరరావు తోట శ్రీనివాస్ రావు పసుపులేటి కృష్ణమూర్తి స్థానిక కాపు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
www.apstatekapunadu.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున మృత్యువాత పడిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు కృతజ్ఞతలు...

మహాశివరాత్రి నాడు తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం నందుగోదావరి లో శివరాత్రి పండుగ సందర్బంగా గోదావరి నదిలో 5గురు కాపు కులానికి చెందిన యువకులు ప్రమాదవాసత్తు మృత్యువాత పడిన వారి కుటుంబాలను పరామర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ సభ్యులు ప్రభుత్వం వారికి వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన సందర్భంగా సానుకూలంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ముప్పిడివెంకటేశ్వరరావుగారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కాపునాడు తరపున చేసిన డిమాండ్ కు స్పందించి వారి కుటుంబాలను ఆదుకుంటూ ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఎంతో హర్షించదగిన విషయం ఈ విషయం పై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు  తరఫున ఎక్స్గ్రేషియా  ప్రకటనలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు 1, తిరుమల శెట్టి పవన్ 2. పడాల దుర్గాప్రసాద్ 3. అనిశెట్టి పవన్ 4.గర్రీ ఆకాష5. పడాల సాయి,ల ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ఎన్ డి ఏ గవర్నమెంట్ కు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు గోవింద శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు కొవ్వూరు మండల కన్వీనర్ ఏరు బండి వీర వెంకట్రావు కొవ్వూరునియోజకవర్గం కన్వీనర్ పుప్పాల సత్యనారాయణ తాళ్లపూడి మండల అధ్యక్షులు నామన బుల్లి రాజు చాగల్లు మండల కన్వీనర్ ఇంటి దుర్గ ప్రసాద్ తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.
www.apstatekapunadu.com





గుంటూరు కృష్ణ జిల్లాల ఎన్డీఏ కూటమి  ఉమ్మడి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు  బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఈరోజు స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డులో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం లో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచిన శ్రీ ఆలపాటి రాజా రాజేంద్రప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేసిన అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ రావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు వారి మిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

http://www.mallelatelugutejam.com

http://www.kapunews.com

http://www.apstatekapunadu.org