కాపుల సంక్షేమానికి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి చిలకలూరిపేట పట్టణ మహిళ అధ్యక్షురాలు శ్రీమతి ఏకాంబరపు సునీత తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామకం పత్రం అందుకున్న ఏకాంబరపు సునిత తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికి జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన సునీత. కాపు నాడు నియమ నిబంధన అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవాసమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలియజేశారు. కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం సమితి వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా చిలకలూరిపేట పట్టణంలో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
Post A Comment:
0 comments: