కాపుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి నెల్లూరు పట్టణ కన్వీనర్ తంజావూరు శివ శంకర వరప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు నుంచి నియామక పత్రం అందుకున్న ఆయన, తన నియామకానికి కారణమైన అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి శివ శంకర వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. సమితి నియమ నిబంధనలు అనుసరించి పని చేస్తానని, సమితి చేపట్టబోయే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని వెల్లడించారు. కాపు సామాజిక వర్గ అభివృద్దికి, వారి హక్కుల సాధన కోసం సమితి తరుపున పాల్గొంటానని పేర్కొన్నారు.
-----------------------
Post A Comment:
0 comments: