కాపుల సంక్షేమానికి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తిరుపతి నియోజకవర్గ ప్రముఖ కాపు నాయకులు తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి తుపాకుల మురళి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపినాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు ద్వారా నియామక పత్రం అందుకున్న తుపాకుల మురళి తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన తిరుపతి జిల్లా కమిటీ వారికి రాష్ట్ర కమిటీ వారికి జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాపునాడు నీమ నిబంధనలను అనుసరించి పని చేస్తానని కాపునాడు సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు. కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం సమితి వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా తిరుపతి జిల్లా వ్యాప్తంగా పాల్గొంటానని పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: