ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మండూరు గ్రామంలో  బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి లతా గారి ఇంటి వద్ద చుండూరు మండల కాపునాడు సమావేశం జరిగింది  ఈ సమావేశానికి ముందుగా స్థానికంగా ఉన్న కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తధానతరం రెడ్డి లతా గారి ఇంటి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు  జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవిందు శంకర్ శ్రీనివాసన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు చిలకలూరిపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అయిన ఏకాంబరపు సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు అయిన రెడ్డి లతా గారికి నియామకం పత్రం అందజేసి దుశ్యాలువ తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అలాగే వారి భర్త గారైన రెడ్డి శివరామకృష్ణ గారికి గతంలో అప్పగించిన చుండూరు మండల అధ్యక్ష పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు కాపు సంఘం ఏర్పాటు గురించి వాటి విధివిధాల గురించి స్థానిక కాపు నాయకులు అందరికీ  సవివరంగా వివరించి కాపు సంఘంలోకి ఆహ్వానించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక జనసేన నాయకులు స్థానిక తెలుగుదేశం నాయకులు కాపు నాయకులు బాధ్యతలు స్వీకరించిన రెడ్డి లతా గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: