కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున తిరుపతి నియోజకవర్గ కాపు నాయకులైన తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రమేష్ బాబు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న ఎస్ రమేష్ బాబు తన నియామకానికి సహకరించిన తిరుపతి జిల్లా కమిటీ సభ్యులకు రాష్ట్ర కమిటీ సభ్యులకు జాతీయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు రమేష్ బాబు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం సమితి వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా తిరుపతి జిల్లాలో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని విజయవంతం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు
Post A Comment:
0 comments: