కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున తూర్పుగోదావరి జిల్లా యువజన కాపు నాయకులైన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కన్వీనర్ కర్రీ దండు నాయుడు తెలియజేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న కర్రీ దండు నాయుడు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కాపు నాయకులకు తూర్పుగోదావరి జిల్లా కమిటీ వారికి రాష్ట్ర కమిటీ వారికి జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కర్రీ దండు నాయుడు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
Post A Comment:
0 comments: