ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున జనసేన నాయకులైన ఆమంచి స్వాములు గారిని చీరాల పందిళ్ళపల్లి లోని వారి నివాసంలో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న కాపులపై దాడుల గురించి భవిష్యత్తులో కాపు సంఘాల బలోపేతం గురించి కాపు రిజర్వేషన్ల గురించి మరియు కేంద్ర ప్రభుత్వం కాపులకు ఇచ్చిన ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ 10% రిజర్వేషన్ లో 5% వాటా సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించడం జరిగింది. ఆమంచి స్వాములు ను కలిసిన కాపు నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవింద శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు తోట సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాపుల భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించడం జరిగింది.
Post A Comment:
0 comments: