కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున కందుకూరు నియోజకవర్గ కాపు మహిళా నాయకులైన కందుకూరు నియోజకవర్గ మహిళా కన్వినర్ మద్దెల ఉష తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న మద్దెల ఉష తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన  కందుకూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మద్దెల ఉష కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు. కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా కందుకూరు నియోజకవర్గం లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: