కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున గుంటూరు జిల్లా పెదకాకాని మండల కాపు నాయకులైన పెదకాకాని మండల అధ్యక్షులు తిరుమలశెట్టి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న తిరుమలశెట్టి మనోజ్ కుమార్ తన నియామకానికి సహకరించిన వారికి జిల్లా కమిటీ సభ్యులకు రాష్ట్ర కమిటీ సభ్యులకు జాతీయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమలశెట్టి మనోజ్ కుమార్ కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా పెదకాకాని మండలం లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
Post A Comment:
0 comments: