చిలకలూరిపేట మార్కెట్ చైర్మన్ కాపులకే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట సత్యం కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి ఏకగ్రీవ తీర్మానం
*మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి ని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి*
మార్కెట్ యార్డ్ చైర్మన్ విషయం మీద పత్తిపాటిని కలిసిన పురుషోత్తపట్నం కూటమి నాయకులు*
చిలకలూరిపేట మార్కెట్ చైర్మన్ ఆశిస్తున్న ,పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు, మంత్రిని ఎదుర్కొన్న ధైర్యవంతుడు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పార్టీని విడకుండా ఉన్న మగధీరుడు,
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి, ఆర్థికంగా చితికిపోయిన, తెలుగుదేశం పార్టీ లోనే నా ఊపిరి పోవాలి అనే దృడ సంకల్పంతో పార్టీ కోసం కష్టపడుతూ, పార్టీ విజయం కోసం 2019 నుంచి 24 ఎలక్షన్స్ లో మంత్రిని ఎదుర్కొని పురుషోత్తపట్నం లో అఖండ మెజార్టీని సాధించి పత్తిపాటికి కానుక ఇచ్చి, ఇంటి పేరునే, పార్టీ పేరుగా మార్చుకున్న టిడిపి సత్యం,
ఇలాంటి మంచి నాయకుడి కోసం పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి వారు చిలకలూరిపేట నియోజకవర్గంలోని కాపులందరితో సంప్రదించి అందరి సలహాలు సూచనల మేరకు, కాపు సంఘాల తరఫున తోట సత్యం కి చిలకలూరిపేట మార్కెట్ చైర్మన్ ఇవ్వాలి అని ఏకగ్రీవ తీర్మానం చేశారు,
ఈ విషయం మీద మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి నివాసం వద్దకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి వారు ఏకగ్రీవ తీర్మానం పత్రాన్ని అందించి, టిడిపి సత్యం పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి మీరు తప్పనిసరిగా చిలకలూరిపేట మార్కెట్ చైర్మన్ ఇవ్వాలి అని తెలియజేశారు,
మీ అందరి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తానని తెలియజేసిన మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు,
Post A Comment:
0 comments: