మల్లెల శివ నాగేశ్వరరావు ఫౌండర్ మరియు జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి మల్లెల శివ నాగేశ్వరావు గారి గురించి
కాపుల సంక్షేమం, రాజ్యాధికారం అనే సంకల్పంతో మల్లెల శివనాగేశ్వరరావు జీవితం కొనసాగింది. రాష్టవ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల్లో మల్లెల శివనాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. విద్యార్ధిదశ నుంచే కాపుల ప్రముఖ కాపుల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. కాపు సంఘాల పితామహులు కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు గారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో ఆయన స్పూర్తితో అడుగుజాడలలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేశారు.విద్యార్ది దశలోనే కీర్తిశేషులు వంగవీటి మోహన రంగాను అమితంగా ఇష్టపడే మల్లెల స్వయంగా ఆయనను కలవడమే కాకుండా గే విజయవాడ కృష్ణ నది ఒడ్డున ఏర్పాటు చేసిన కాపునాడు బహిరంగ సభలో పాల్గొన్నారు.
తదుపరి పిల్లా వెంకటేశ్వరరావు గారి కాపు సంఘంలో కీలక బాధ్యతలు వహించారు. పిల్లా వెంకటేశ్వరరావు గారి కాపు సంఘంలో సుధీర్ఘకాలం పనిచేసిన అనుభవం గడించడంతో పాటు కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులను ఏకతాటిపై తేవడానికి, ఉద్యమంలో భాగస్వాముల్ని చేయడంలో కీలక పాత్ర పోషించారు.ఇందులో బాగంగానే .
మల్లెల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990 లో చిలకలూరిపేటలో కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాన్ని చేపట్లారు. ఈ క్రమంలోనే 5000 వేల మందితో కాపు రిజర్వేషన్ల కోసం పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. విశేషమేమిటంటే ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు తన్నీరు సీతారామయ్య కీర్తిశేషులు కారసాని శ్రీనివాసరావు నీలం రామ్మోహన్రావు తదితర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం చేసిన ప్రతి కార్యక్రమాన్ని చిలకలూరిపేటలో నిర్వహించారు. తదుపరి కిర్లంపూడి నుండి తిరుపతి వరకు జరిగిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే చిలకలూరిపేటలో ముద్రగడ పద్మనాభం గారికి వసతి ఏర్పాటు చేసి, ఆయన సూచనలు, సలహాలు స్వీకరించారు. పిఠాపురంలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో చిలకలూరిపేట నుండి 100 మందితో ర్యాలీగా వెళ్లి పాల్గొన్నారు.
ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనడం అలాగే తుని లో ఏర్పాటు చేసిన కాపు రిజర్వేషన్ల సాధన పబ్లిక్ మీటింగ్లో పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట నుండి వంద మందితో ర్యాలీగా వెళ్లి పాల్గొనడం జరిగింది.ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు నాయకులు కడప నారాయణస్వామి రాయల్.. వాసిరెడ్డి ఏసుదాసు.. ఆకుల రామకృష్ణ దాసరి రాము తదితర ముఖ్య కాపు నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. .
కాపు సంఘాల ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండటం... చిలకలూరిపేటలో కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
కాపుల హక్కుల పరిరక్షణకు, కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి పాటు పడుతూ కాపు సమాజంలో ఐక్యత సాధించటానికి మల్లెల శివనాగేశ్వరరావు కృషి చేస్తున్నారు.
Post A Comment:
0 comments: